Category : నేర | Sub Category : తెలంగాణ Posted on 2025-04-02 10:31:33
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- మహబూబాబాద్ జిల్లాలో దారుణ హత్య జరిగింది.. పార్థసారథి అనే హెల్త్ సూపర్వైజర్ ను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతంగా గొడ్డలితో నరికి చంపారు.. రోడ్డు పక్కన ఉన్న మిరప తోటలోకి తీసుకెళ్ళిన దుండగులు అతన్ని అతికిరాతకంగా నరికి చంపారు.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుకున్నారు..
ఈ హత్య మహబూబాబాద్ మండలం భజనతండా శివారులో జరిగింది.. బైక్ పై ఒంటరిగా వెళ్తున్న పార్థసారధిని గుర్తుతెలియని వ్యక్తులు పక్కనే ఉన్న మిర్చి తోటలోకి తీసుకువెళ్లారు.. అతని అతికిరాతకంగా గొడ్డలితో నరికి తలపై మోది చంపారు..
మృతుడు పార్థసారథి స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కాగా ఆయన ప్రస్తుతం దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు.. బైక్ పై వెళ్తున్న అతన్ని పథకం ప్రకారం అడ్డగించిన గుర్తుతెలియని దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు