Responsive Header with Date and Time

కందిపప్పు ఎక్కువగా తింటున్నారా..?

Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2025-04-01 10:04:20


కందిపప్పు ఎక్కువగా తింటున్నారా..?

తెలుగు వెబ్ మీడియా న్యూస్:కందిపప్పు మన భారతీయ ఆహారంలో ప్రోటీన్ సమృద్ధిగా అందించే ముఖ్యమైన భాగం. అయితే ఇటీవలి కాలంలో దీనిలో కల్తీ పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారులు కేసరి పప్పు అనే విషపూరిత పదార్థాన్ని కలిపి అమ్ముతున్నట్లు గుర్తించారు. దీనిని తినడం వల్ల నరాల సమస్యలు, లాథిరిజం (అడుగులు వేయలేకపోవడం), క్యాన్సర్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పైగా, టార్ట్రాజిన్ అనే ఆహార రంగును కలిపి, ఈ కల్తీని మరింత గుర్తించకుండా చేస్తున్నారు, ఇది హార్మోన్ల అసమతుల్యతతో పాటు క్యాన్సర్ ముప్పును కూడా పెంచుతుంది.

కేసరి పప్పు కందిపప్పును పోలి ఉన్నప్పటికీ, ఇది త్రికోణాకారంగా ఉంటుంది, అయితే నిజమైన కందిపప్పు నునుపుగా, గుండ్రంగా ఉంటుంది. ఇంట్లోనే దీని కల్తీని పరీక్షించడానికి 10 గ్రాముల పప్పులో 25 మి.లీ నీరు, 5 మి.లీ హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపి వేడి చేస్తే, నీటి రంగు మారితే కల్తీ ఉందని అర్థం. ఆరోగ్య రిస్క్‌లను నివారించేందుకు, గుర్తింపు పొందిన బ్రాండ్‌ల పప్పును మాత్రమే కొనుగోలు చేయడం ఉత్తమం

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: