Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2025-04-16 10:38:27
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో డిఫెండింగ్ ఛాంపియన్ పంకజ్ అడ్వాణీ టైటిల్ పోరుకు దూసుకెళ్లాడు.
కార్లో (ఐర్లాండ్): సెమీఫైనల్లో అతడు 1070-300తో సహచరుడు ధ్రువ్ సిత్వాలాను చిత్తు చేశాడు. ఆరంభంలోనే రెండు బ్రేక్లు సాధించి 400 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచిన పంకజ్.. తర్వాత అదే జోరు కొనసాగించి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 2016 నుంచి పంకజ్ ఈ టోర్నీలో ఓడిపోలేదు. మరో సెమీస్ లో డేవిడ్ కాసియర్తో భారత ఆటగాడు సౌరభ్ కొఠారి తలపడనున్నాడు.