Responsive Header with Date and Time

కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం

Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-03-31 10:41:58


కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం

తెలుగు వెబ్ మీడియా న్యూస్:బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  కు మరో ప్రతిష్టాత్మక సదస్సుకు ఆహ్వానం అందింది. బ్రిటన్‌  లో జరిగే ఐడియాస్‌ ఫర్‌ ఇండియా-2025 సదస్సుకి రావాలంటూ బ్రిడ్జ్‌ ఇండియా     సంస్థ ప్రత్యేకంగా కేటీఆర్‌ను ఆహ్వానించింది. మే 30 తేదీన లండన్‌  లోని రాయల్‌ లాంకాస్టర్‌ హోటల్లో జరిగే సద్సుకు కేటీఆర్‌ను ముఖ్య వక్తగా పిలుస్తూ బ్రిడ్జ్‌ ఇండియా వ్యవస్థాపకుడు ప్రతీక్‌ దత్తానీ    తాజాగా ఆహ్వాన లేఖ పంపారు.  2023లో ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్‌ ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నాయని ప్రతీక్‌ పేర్కొన్నారు. ఈసారి కూడా లండన్‌ వ్యాపార వర్గాలు, ఇండో -యూకే కారిడార్లోని ముఖ్య వ్యక్తులు, తెలుగు ప్రవాసులు కేటీఆర్‌ను కలవడానికి, ఆయన ప్రసంగాన్ని వినడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటికీ కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు ఆహ్వానిస్తున్నామని ప్రతీక దత్తానీ లేఖలో ప్రస్తావించారు.


 

Leave a Comment: