Category : నేర | Sub Category : జాతీయ Posted on 2025-03-31 10:26:14
తెలుగు వెబ్ మీడియా న్యూస్ :- ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన ఉజ్వల్ కిషోర్, అతని భార్య నీలు శ్రీవాస్తవ.. ఏకంగా వ్యభిచార రాకెట్ నడుపుతూ అడ్డంగా బుక్కయ్యారు. గత ఐదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా.. తమ నివాసంలోనే ఈ దందాను నిర్వహిస్తున్న ఉజ్వల్ కిషోర్ జంట బాగోతాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) అధికారులు బహిర్గతం చేశారు. అసభ్యకర వీడియోలను ప్రసారం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న దంపతులను నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీ శివారు నోయిడాలో మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ రీసెర్చ్ పేరుతో తప్పుడు వివరాలను సృష్టించి డబ్బులను విదేశీ కంపెనీలకు తరలిస్తున్నారన్న సమాచారంతో ఈడీ అధికారులు.. దంపతుల నివాసంలో దాడులు చేశారు. దాంతో.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైప్రస్ దేశానికి చెందిన టెక్నియస్ లిమిటెడ్ అనే సంస్థతో ఈ జంటకు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అడల్ట్ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్లను నిర్వహిస్తున్నట్లు తేల్చారు. ఈడీ దాడుల్లో 15.66 కోట్ల రూపాయల అక్రమ విదేశీ నిధులను స్వాధీనం చేసుకున్నారు.