Category : | Sub Category : క్రీడా Posted on 2024-09-12 16:13:06
తెలుగు వెబ్ మీడియా న్యూస్: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత్ (India) జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే వరుసగా మూడు విజయాలు సాధించి భారత్.. గురువారం 3-1తో దక్షిణ కొరియాను ఓడించి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. భారత్ తరఫున అరైజీత్ సింగ్ (8వ నిమిషం), కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ (9వ నిమిషం, 43వ నిమిషం) గోల్స్ చేశారు. దక్షిణ కొరియా తరపున నమోదైన ఏకైక గోల్ ను జిహున్ యాంగ్ (30వ నిమిషం) సాధించాడు. భారత్ శనివారం జరిగే చివరి గ్రూప్ మ్యాచ్లో పాకిస్థాన్ తో తలపడనుంది. అంతకుముందు భారత్ 3-0తో చైనాను, 5-1తో జపాన్ ను, 8-1తో మలేసియాను ఓడించింది. ఆరు జట్లు పోటీపడుతోన్న ఈ టోర్నీ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతోంది. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్లో ప్రవేశిస్తాయి.