Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2025-04-29 11:31:20
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- ఏషియన్ బేస్బాల్ టోర్నీకి భారత మహిళల జట్టు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన సూపర్ రౌండ్ స్టేజ్లో భారత్ 6-5 తేడాతో థాయ్లాండ్పై గెలిచి పసిడి పోరుకు దూసుకెళ్లింది. మంగళవారం జరిగే తుది పోరులో ఇండోనేషియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. థాయ్లాండ్, పాకిస్థాన్ కాంస్య పోరులో తలపడనున్నాయి. ఈ టోర్నీ ఫైనల్లో నిలిచిన రెండు జట్లు నేరుగా ఏషియన్ చాంపియన్షిప్నకు అర్హత సాధిస్తాయి.