Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-09 10:12:59
తెలుగు వెబ్ మీడియా న్యూస్:-పెట్రోలియం రంగంలో అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు వస్తున్నాయనీ, అవకాశాలు వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రూ.80 వేల కోట్లతో రిఫైనరీ రాబోతోందని వెల్లడిరచారు. ఒడిశా పారాదీప్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీ ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ , ఒడిశా ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో హర్దీప్ సింగ్ పురి పాల్గొన్నారు. గతంలో 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే వాళ్లం. ఇప్పుడు 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ముడి చమురు ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేసి, ఎక్కువ నిల్వ చేస్తాం. ప్రస్తుతం ఒక్కో బ్యారల్ ముడి చమురు 60 డాలర్ల వరకు ఉంది అని తెలిపారు.