Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-26 10:16:01
తెలుగు వెబ్ మీడియా న్యూస్ :-ప్రధాని నరేంద్ర మోదీ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, కేంద్ర నిర్ణయానికి రాష్ట్రం మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం మే 2న అమరావతి పున ప్రారంభ పనులకు ప్రధానిని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. సుమారు రూ.లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు మోదీతో శంకుస్థాపన చేయించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రోడ్మ్యాప్ తయారు చేసింది. వెలగపూడి సచివాయం వెనక అమరావతి పున ప్రారంభ పనులకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. అదే రోజు రోడ్షో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 30 వేల మంది పాల్గొంటారని అంచనా. రూ.లక్ష కోట్ల పనుల ప్రారంభ సూచికగా ప్రధాని మోదీ, ఫైలాన్ ను ఆవిష్కరించనున్నారు. ప్రధానితో భేటీ సమయంలో అమరావతి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వివిధ అంశాలపై సీఎం చర్చించినట్లు తెలుస్తోంది.