Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-09 10:11:50
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : డొమినికన్ రిపబ్లిక్లోని ఓ నైట్క్లబ్ పైకప్పు కూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 58కి పెరిగింది. మరో 160 మంది గాయపడ్డారు. రాజధాని శాంటో డొమింగోలోస్థానికంగా ఉన్న జెట్ సెట్ నైట్క్లబ్లో వేడుక జరుగుతుండగా పైకప్పు కూలింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న బయటకు తీసి సమీప ఆస్పత్రి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
ప్రమాద సమయంలో ప్రదర్శన ఇస్తున్న మొరాంగే సింగర్ రూబీ పెరెజ్ గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషాదంపై తీవ్రంగా చింతిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు లూయిస్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఘటనా స్థలంలో రెస్క్యూ బృందాలు అవిశ్రాంతంగా సహాయక చర్యలు అందించినట్లు వెల్లడించారు. పైకప్పు కూలిన జెట్ సెట్ నైట్క్లబ్ వద్దకు వెళ్లిన లూయిస్ బాధిత కుటుంబాలను పరామర్శించారు.