Responsive Header with Date and Time

Category : వ్యాపారం | Sub Category : జాతీయ Posted on 2024-09-26 18:23:41


TWM News:-ఆన్ లైన్ షాపింగ్ వచ్చినతర్వాత ఇంటికి, వంటికి ఏది కావాలన్నా ఈజీగా కొనుగోలు చేసుకోగలుగుతున్నారు. ముఖ్యంగా ఈ-కామర్స్ వెబ్ సైట్లు అందించే డిస్కౌంట్లు, ఆఫర్లకు ఆకర్షితులవుతున్న వినియోగదారులు విరివిగా వాటిల్లో కొనుగోళ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ ఓ ప్రత్యేకమైన సేల్స్ నిర్వహిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమవుతోంది. దీనిలో అన్ని రకాల ఎలక్ట్రానిక్స్, గృహోపరణాలు తదితర వస్తువులపై అదిరే డీల్స్ ఉన్నాయి. వాటిల్లో డైనింగ్ టేబుల్స్ పై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. మీరు ఓమంచి డైనింగ్ టేబుల్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ కథనం మీకు బాగా ఉపయోగపడుతుంది. అమెజాన్లో సేల్లో ఆఫర్లో లభిస్తున్న బెస్ట్ డైనింగ్ టేబుళ్లపై డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అడిచ్వాల్ ఫర్నీచర్ సాలిడ్ షీషామ్ వుడ్ 4 సీటర్ డైనింగ్ సెట్.. ఈ డైనింగ్ టేబుల్ పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో భాగంగా 47శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఇది మీ లివింగ్ రూమం, డైనింగ్ హాల్, ఆఫీస్ వర్క్ దేనికైనా సరిపోతుంది. ఇది నాణ్యమైన షీషామ్ వుడ్ తో చేసినది కావడంతో మన్నికగా ఉంటుంది. ఈ సెట్ 100కేజీల వరకూ బరువును మోయగలుగుతుంది. దీని ధర రూ. 15,999గా ఉంది.

ఇన్మార్ వార్ బిగ్ వుడెన్ డైనింగ్ టేబుల్.. ఇది ఆరుగురు కూర్చొని భోజనం చేయడానికి సరిగ్గా సరిపోతుంది. ఇంటి నుంచి ఆఫీసు నుంచి వరకూ ఎక్కడైనా, ఎలాంటి చోట్లైనా వాడొచ్చు. ఇది షీషామ్, రోస్ వుడ్ సాయంతో ప్రీమియం లుక్ ని అందిస్తుంది. మీ హాల్కు మరింత అందాన్ని అందిస్తుంది. దీని పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో 58శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దీని ధర రూ. 16,799గా ఉంది.

జీన్ వుడ్ సాలిడ్ షీషామ్ వుడ్ ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 2024లో ఈ డైనింగ్ టేబుల్ పై 38శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇది నలుగురు కూర్చొ దగని డైనింగ్ టేబుల్. ఇది మీ డైనింగ్ ప్రాంతానికి మరింత అందాన్నిస్తుంది. ఇది అత్యంత నాణ్యంగా ఉంటుంది. దీని ధర రూ. 17,409గా ఉంది.

సోనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ సాలిడ్ షీషామ్ వుడ్ డైనింగ్ సెట్.. ఈ స్టైలిస్ డైనింగ్ టేబుల్ పై ఏకంగా 62శాతం డిస్కౌంట్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో లభిస్తోంది. ఆరుగురికి సరిపోయే ఈ డైనింగ్ టేబుల్ సాలిడ్ షీషామ్ వుడ్ తో తయారైంది. ఇది నాలుగు రకాలుగా అందుబాటులో ఉంటుంది. వాల్నట్, హనీ టేక్, మహోగనీ వంటి ప్రీమియం మెటీరియల్ తో వస్తుంది. ఇది మీ ఆఫీసు అవసరాలకు కూడా సరిగ్గా సరిపోతుంది. దీని ధర రూ. 24,999గా ఉంది.

వీకే ఫర్నీచర్ సాలిడ్ షీషామ్ వుడ్ డైనింగ్ టేబుల్.. ఇది నలుగురు కూర్చోదగిన టైనింగ్ టేబుల్. ఇది ఇది మీ లివింగ్ స్పేస్ మరింత హంగులను అద్దుతుంది. మోడర్న్ లుక్ ను అందిస్తుంది. దీనిపై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024లో 35శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇది చెస్ట్ నట్, అందమైన నేచుల్ వుడ్ గ్రెయిన్ ఫినిష్ తో వస్తుంది. ఇది సౌకర్యంతో పాటు మంచి లుక్ ని అందిస్తుంది. చెక్క అధిక నాణ్యతతో వస్తుంది.


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: