Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-09-26 15:53:08
తెలుగు వెబ్ మీడియా న్యూస్: బీ అర్ ఎస్ హయాంలో నేతలన్నను కాపాడుకున్నామని, ఇప్పుడు మళ్లీ ఆత్మహత్యలు మొదలయ్యాయని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. సిరిసిల్ల నేతలన్నకు రూ.3,312 కోట్ల ఆర్డర్లు ఇచ్చామని, ఉపాధి కల్పనతో నేతన్నల ఆత్మహత్యలు తగ్గాయన్నారు. ప్రజలకు కేసీఆర్ కిట్లు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక అందజేశాం. నేతన్నలతో చీరలు నేయించి పంపిణీ చేశాం. సిరిసిల్లను మరో తిరుప్పూరు చేయడానికి కృషి చేశాం. కాంగ్రెస్ హయాంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేశారు. బతుకమ్మ చీరల్లో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. దానిపై విచారణ చేయాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పాం. సిరిసిల్ల నేతన్నల తరపున పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మా పోరాటానికి నేతన్నలు కూడా సహకరించాలి.