Category : జాతీయ | Sub Category : రాజకీయం Posted on 2024-09-19 14:43:03
హర్యానా దంగల్ హీటెక్కిస్తోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీతోపాటు కాంగ్రెస్, ఆప్ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.. అంతేకాకుండా మాటల తూటాలు పేలుస్తూ హీటెక్కిస్తున్నాయి. హర్యానాలోని మొత్తం 90 స్థానాలకు అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ తరుణంలో ఎలాగైనా మళ్లీ అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ తో ముందుకు సాగుతోంది.. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. లాడ్లీ లక్ష్మీ యోజన పథకం కింద మహిళలకు నెలకు రూ.2,100 ఇస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. లాడ్లీ లక్ష్మీ పథకం నుంచి.. అగ్నివీర్ ఉద్యోగాల వరకు ఎన్నో హామీలనిచ్చింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం సంకల్ప పత్ర పేరిట.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు జెపి నడ్డా గురువారం రోహ్తక్లో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ మేనిఫెస్టోను ఖచ్చితంగా అమలు చేస్తామని.. ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలన్నింటిని తప్పకుండా నెరవేరుస్తుందని నడ్డా హామీనిచ్చారు.
\r\n