Responsive Header with Date and Time

Category : ఇతర | Sub Category : ఇతర వార్తలు Posted on 2024-09-19 12:46:31


TWM News:-మధుమేహం సాధారణ వ్యాధిగా మారుతోంది. వృద్ధులే కాదు యువత కూడా దీని బారిన పడుతున్నారు. శరీరంలో మధుమేహం లక్షణాలు కనిపించగానే బాధితులు ఏం తినాలి, ఏం తినకూడదు అనే లెక్కలు వేయడం మొదలుపెడతారు. డయాబెటిస్‌లో మనం తినే ఆహారం రక్తంలో చక్కెరను ప్రభావితం చేస్తుంది. ఆహారం తిన్న వెంటనే రక్తంలో చక్కెర పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆహారంతో పాటు ఆహారం తిన్న తర్వాత ఏం చేయాలో కూడా తెలుసుకోవాలి.

రక్తంలో చక్కెరను నియంత్రించడానికి వాము సరైన ఔషధం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆహారం తీసుకున్న తర్వాత కాస్త వామును నోట్లో వేసుకోవటం వల్ల షుగర్ పెరగకుండా నియంత్రిస్తుందని అంటున్నారు.

వాములో ప్రొటీన్, ఫ్యాట్, పీచు, కార్బోహైడ్రేట్ వంటి పోషకాలు ఉంటాయి. దీనిలోని పీచు శరీరంలోని బ్లడ్ షుగర్ నియంత్రణలో సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్‌గా భోజనం తర్వాత తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది.

మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు వాము అద్భుతంగా ఉపయోగపడుతుంది. డయాబెటిస్ రోగులు వాము తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే వాములో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ అనేది రక్తంలో షుగర్ స్థాయిని తగ్గించడంలో దోహదపడుతుంది. మీ డైట్‌లో వాము చేర్చడం ద్వారా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచవచ్చు.

వామును ప్రతిరోజూ మీ ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక కప్పు నీళ్లలో ఒక స్పూన్ వాము వేసి మరిగించాలి. ఆ తరువాత వడపోసి..భోజనం చేసిన 40 నిమిషాల తరువాత తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయటం వల్ల బ్లడ్‌ షుగర్‌ అదుపులో ఉంటుంది.

వామును ప్రతి రోజూ తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు. డయాబటిస్ ఉన్నప్పుడు బాడీ మెటబోలిజం సరిగ్గా ఉండదు. మెటబాలిజం వేగం తగ్గితే..బరువు పెరుగుతారు. ఇలాంటి పరిస్థితుల్లో వామును ఆహారంలో చేర్చుకోవటం వల్ల షుగర్‌ బాధితుల్లో మెటబోలిజం వృద్ధి చెందుతుంది.


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: